ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాగిన మైకంలో.. మరణాన్ని హత్తుకున్నాడు!

తాగిన మైకంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో తూలుతూ విద్యుత్​ నియంత్రికను పట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.

By

Published : May 11, 2020, 8:10 PM IST

Published : May 11, 2020, 8:10 PM IST

person died due to holding transformer in korutla  at telengana
తెలంగాణలో ట్రాన్ఫర్మర్ ముట్టకుని వ్యక్తి మృతి

మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ముట్టుకుని వ్యక్తి మృతి

మద్యం మత్తులో ఎంతటి ప్రమాదాలు జరుగుతాయన్నది తెలిపే ఘటన ఇది. మత్తు తలకెక్కి విద్యుత్​ నియంత్రికను పట్టుకుని ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ వ్యక్తి మద్యం మత్తులో నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు.

మైకంలో తూలూతూ విద్యుత్​ నియంత్రికను పట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే అక్కడిక్కడే మరణించాడు. మృతుడు ఏపీలోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం వెంగళాపూర్​కు చెందిన సుబ్బారాయుడిగా గుర్తించారు. ఇతను కొంత కాలంగా కోరుట్లలోనే ఉంటూ తాపీ పని చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details