ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

food problems in hospitals: బిల్లుల పెండింగ్ కారణంగా.. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఆహారం

contractors facing problems: ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే రోగులకు మందులు, సదుపాయాలే కాదు.. సరైన భోజనమూ అందక.. ఇబ్బందులు పడుతున్నారు. మెనూల్లోని ఆహారం.. ప్రదర్శన పట్టికలకే పరిమితమవుతోంది. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు అందక ఈ దుస్థితి తలెత్తుతోంది.

By

Published : Dec 10, 2021, 9:51 AM IST

Updated : Dec 10, 2021, 10:19 AM IST

ggh-food-contractors-facing-problems-due-to-pending-meals-bills
బిల్లుల పెండింగ్ కారణంగా.. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఆహారం

బిల్లుల పెండింగ్ కారణంగా.. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఆహారం

contractors problems due to pending bills: గుంటూరు జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరైన భోజనం అందడం లేదు. గుత్తేదారులకు భోజన బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. జిల్లాలో బోధన, జిల్లా, ప్రాంతీయ వైద్యశాలల్లో భోజన బిల్లులు లక్షల రూపాయల్లో పెండింగులో ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్​లో అయితే.. రెండేళ్లుగా ఏడు కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. ఫలితంగా గుత్తేదారులు మెనూ ప్రకారం భోజనాలు అందించలేకపోతున్నారు. జిల్లా నుంచి బిల్లులు నిర్ధరించి సీ.ఎఫ్.​ఎమ్​.ఎస్​కు పంపించినా అక్కడ నెలల నెలల తరబడి పెండింగులోనే ఉన్నాయి. గుంటూరు బోధనాస్పత్రిలో రోజుకు సగటున 1500 మంది వరకు భోజనాలు అందిస్తారు. బిల్లులు బకాయిలు పడినప్పటికీ.. గుత్తేదారులు అప్పులు చేసి రోగులకు భోజనం సమకూరుస్తున్నారు.

ఎన్ని బిల్లులు పంపుతున్నా చిల్లిగవ్వ రావట్లేదు..

గుంటూరుతో పాటు.. తెనాలి జిల్లా ఆస్పత్రి, సత్తెనపల్లి, నరసరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలల్లో ఉండే రోగులకు డైట్ కాంట్రాక్టర్ల ద్వారా భోజనం పెడుతున్నారు. ఇన్‌ పేషెంట్లతో పాటు సహాయంగా వచ్చే వారిలో ఒకరికి ప్రభుత్వమే ఉచితంగా భోజనం పెడుతోంది. గర్భిణీలు, బాలింతలకు ప్రొటీన్‌ డైట్ అందిస్తారు. వీటికి వేర్వేరు ధరలు ఉన్నాయి. ఈ మేరకు బిల్లులు తయారుచేసి పంపుతున్నా.. క్లియర్ కావడం లేదని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రిలో బాలింతలు, గర్భిణీలు, రోగులకు పోషకాహారం అందడం లేదు. నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాత బకాయిలి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. జీజీహెచ్ సూపరింటెండెంట్ చెబుతున్నారు.

భోజనాల్లో కరోనా రోగులు ప్రస్తుతం తక్కువ మంది ఉన్నారు. దాదాపు 50, 60 మంది ఉన్నారు. నాన్ కొవిడ్​లో స్ట్రెంత్ 12 వేల 600. ప్రస్తుతం దాదాపు 1500 మంది ఉన్నారు. వారందరికీ నిరంతరాయంగా భోజనాలు అందిస్తున్నాం. భోజనాల బిల్లులు కొవిడ్ బడ్జెట్​కి సబ్మిట్ చేశాం. డబ్బులు రాగానే వారికి ఇచ్చేస్తాం.

- ప్రభావతి, జీజీహెచ్​ సూపరింటెండెంట్

కరోనా సమయంలోవి కూడా నేటికీ అందలేదు..

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ.. గుత్తేదారులకు బిల్లులు రాకపోవడం వల్ల రోగులకు భోజనంలో కోతలు తప్పడం లేదు. కొవిడ్ రెండో దశ సమయంలో ఇన్‌ పేషెంట్లకు పెట్టిన భోజనాలకు సంబంధించి బిల్లులు ఇప్పటివరకూ అందలేదు. ఒంగోలు రిమ్స్‌లోనే దాదాపు రెండు కోట్ల వరకు బిల్లులు బకాయిలు ఉన్నాయి. జననీశిశు సురక్షణ బిల్లులు జీజీహెచ్​లో గత ఏడాది మార్చి నుంచి నిలిచిపోయాయి. వీటి కోసం గుత్తేదారులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

నాకు ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ అప్పటికప్పుడు సరుకులు తెస్తూ అందరికీ భోజనం అందించాను. కానీ ఇంతవరకు నాకు బిల్లు రాలేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పులోళ్లు వచ్చి ఇంటి చుట్టూ తిరిగిపోతున్నారు. 19 లక్షలు రావాలి.

- ఫయాజ్, గత్తేదారు

గతంలో కొవిడ్ కేర్ సెంటర్​ను బీఈడీ కాలేజ్​లో ఏర్పాటు చేయడం జరిగింది. రెండు నెలలపాటు కొవిడ్ రోగులు.. పాజిటివ్ వచ్చి ఇంటి దగ్గర వసతులు లేవో వారందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన భోజనాన్ని అందిచడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించి బిల్లులు కొంచెం టెక్నికల్​గా సమస్య ఉందని తెలియజేశారు. అవి రాగానే.. ఏదైతే బిల్లులు పెండింగ్​లో ఉన్నయో వారందరికీ కూడా డబ్బులు చెల్లిస్తం.

- పుల్లారావు, కనిగిరి తహసీల్దార్

ఇప్పటికైనా అందించాలి..!

ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే కానీ.. మెనూ ప్రకారం ఆహారం అందించలేమని గుత్తేదారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

TTD: తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత.. ఎఫ్​ఎమ్​ఎస్ కార్మికుల అరెస్ట్

Last Updated : Dec 10, 2021, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details