ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారావారిపల్లి అటవీ ప్రాంత సమీపంలో నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. సీఐ సోమయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. 900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నాటుసారా తయారుచేయడం, అమ్మడం నేరమని.. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
నాటుసారా కేంద్రాలపై దాడులు.. 900 లీటర్ల ఊట ధ్వంసం
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడ్డాయి. ఈ కారణంగా నాటుసారా తయారీ పెరిగింది. మారుమూల అటవీ ప్రాంతాల్లో నాటుసారా పెద్దఎత్తున తయారు చేస్తున్నారు. ఈ కేంద్రాలపై పోలీసులు దాడులు చేస్తున్నాారు.
బెల్లం ఊట ధ్వంసం చేస్తున్న పోలీసులు
TAGGED:
నాటుసారా కేంద్రాలపై దాడులు