ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చీరాలలో ప్రశాంతంగా లాక్​డౌన్

By

Published : Apr 5, 2020, 3:30 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్​డౌన్ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అనవసరంగా బయటకు వస్తున్న వారిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Clear lock down in cheerala
చీరాలలో ప్రశాంతంగా లాక్​డౌన్

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే రహదారులు మనుషులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆ సమయంలోనే ప్రజలు బయటకు వస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను ఆపి వాహనదారులను కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details