ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

21న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం - జనవరి 21న  విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు

విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవాలను ఈ నెల 21న నెల్లూరు నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు.

vikrama simhapuri university convocation will celebrated on 21st jan
జనవరి 21న విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు ప్రారంభం

By

Published : Jan 19, 2020, 10:49 PM IST

జనవరి 21న విక్రమ సింహపురి స్నాతకోత్సవాలు

కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ సింహపురి విశ్వ విద్యాలయ స్నాతకోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరగనుంది. 2, 3, 4, 5వ స్నాతకోత్సవాలు నెల్లూరు నగరంలోని కస్తూరిభా కళాక్షేత్రంలో ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 730 మంది విద్యార్థులు పాల్గొనేందుకు అనుమతి పొందారు. పలువురు విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details