ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2020, 9:22 PM IST

ETV Bharat / state

నిబంధనలు సరళతరం... తెరచుకోనున్న పరిశ్రమలు

నెల్లూరు జిల్లాలో ఉన్న పరిశ్రమలు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని... పరిశ్రమల శాఖ ఇన్​చార్జీ జేడీ ప్రసాద్ తెలిపారు. వీటి పనితీరు ఆగిపోతే ఆహారం కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సర్కారు నిబంధనలను సడలించిందని తెలిపారు.

Regulations simplify and open industries very soon in nellore district
వివరాలు వెల్లడిస్తున్న పరిశ్రమల శాఖ ఇన్​చార్జీ డైరెక్టర్

నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు, ఎడిబుల్ ఆయిల్, పవర్ ప్రాజెక్టులను నడిపించుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని పరిశ్రమల శాఖ ఇన్​ఛార్జీ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. రెడ్​జోన్ల పరిధిలో ఉన్న పరిశ్రమలకు నిబంధనలు సరళతరం అయ్యాయని చెప్పారు. నూతన ఉత్తర్వుల ప్రకారం కంటైన్మెంట్ జోన్​కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిశ్రమలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details