ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 27, 2019, 10:29 AM IST

Updated : Nov 27, 2019, 2:24 PM IST

ETV Bharat / state

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో విజయాన్ని అందుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ ఉదయం 9గంటల 28 నిమిషాలకు సతీష్ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోయిన పీఎస్​ఎల్వీ-సీ47 వాహకనౌక మరో 13 నానో ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ 13 నానో ఉపగ్రహాలు..అమెరికాకు చెందినవి.

pslv-c-47-isro-success
pslv-c-47-isro-success

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

దేశ రక్షణ రంగం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్‌-3ప్రయోగం విజయవంతమైంది.దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు,స్థావరాలపై నిఘా నేత్రంలా పనిచేసే ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా రోదసీలోకి పంపింది.శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ల్యాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఉదయం9గంటల28నిమిషాలకు పీఎస్​ఎల్వీ-సీ47వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.

పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం విజయవంతం

పీఎస్​ఎల్వీ-సీ47...కార్టోశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో13నానో ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశ పెట్టింది.ఈ మొత్తం ప్రక్రియ27నిమిషాల్లోనే పూర్తయింది.ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన26గంటల కౌంట్‌డౌన్‌...మంగళవారం ఉదయం7గటంల28నిమిషాలకు ప్రారంభమై....ఇవాళ ఉదయం9గంటల28నిమిషాలకు ముగిసింది.కార్టోశాట్-3బరువు.....సుమారు16వందల25కేజీలు.మూడో తరానికి చెందిన ఈ భూ పరిశీలన ఉపగ్రహన్ని....హై రెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.అంతరిక్షంలో...ఐదేళ్ల పాటు కార్టోశాట్-3సేవలందించనుంది.పట్టణ అభివృద్ధి ప్రణాళిక,గ్రామీణ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి, తీరప్రాంత వినియోగంలో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. దీనితో పాటు..... ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన ఫొటోలను మరింత జూమ్‌ చేసి తీసే వీలు కలుగుతుంది.

Last Updated : Nov 27, 2019, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details