నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమనలో పంట పొలాల్లో నాటు సారా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారుల దాడిచేశారు. ఈ దాడిలో మూడు డ్రమ్ముల నాటుసారా, 600 కేజీల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వారి రాకను గమనించిన నిందితులు అక్కడినుంచి పారిపోయారు. వారికోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బుచ్చి, సిబ్బంది పాల్గొన్నారు.