ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసరాల క్యాంటీన్​

నెల్లూరు కార్పొరేషన్​లో పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసరాల క్యాంటీన్​ను ఏర్పాటు చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దీని ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలు ఇస్తామని ప్రకటించారు.

By

Published : Aug 3, 2021, 7:32 PM IST

sanitation-workers
పారిశుద్ధ్య కార్మికులు

రాష్ట్రంలోనే తొలిసారిగా నెల్లూరు కార్పొరేషన్​లో పారిశుద్ధ్య కార్మికుల కోసం నిత్యావసరాల క్యాంటీన్​ను ఏర్పాటు చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. తక్కువ ధరకే నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంటీన్​ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

అక్షయపాత్ర ఫౌండేషన్ నెల్లూరులోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ ఒకే విధమైన డ్రస్ కోడ్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.


ఇదీ చదవండి:'ఆనందయ్య మందుకు ఆయుష్ శాఖ సూత్రప్రాయ అంగీకారం'

ABOUT THE AUTHOR

...view details