సోమశిల జలాశయం నుంచి విడుదల చేసిన నీరు.. వృథాగా సముద్రంలో కలవకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సంగం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు కిందకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో త్వరలో జరగనున్న ఐఏబీ సమావేశం అనంతరం సోమశిల నుంచి సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేయనున్నారు. కావలి కాలువ ద్వారా విడుదలకు ఏర్పాటు చేస్తుండగా.. ఇరిగేషన్ అధికారులు పనులను పరిశీలించారు.