ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 27, 2021, 3:47 PM IST

ETV Bharat / state

అదుపుతప్పిన బైక్​..కిందపడి డిగ్రీ విద్యార్థిని మృతి

నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం గునపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్పీడ్​ బ్రేకర్​ను గమనించి ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కిందపడి మరణించినట్లు ఆ యువకుడు తెలిపాడు.

student died in accident at gunapadu, gunapadu bike accident
గునపాడు వద్ద ద్విచక్రవాహన ప్రమాదం, గునపాడు బైక్​ ప్రమాదంలో డిగ్రీ విద్యార్థిని మృతి

ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో.. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న ఓ విద్యార్థిని మరణించింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం గునపాడు వద్ద ఈ ఘటన జరిగింది. స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా.. స్పీడ్​ బ్రేకర్​ను గమనించి ఒక్కసారిగా బ్రేక్​ వేయడంతో ఆమె కిందపడి ప్రాణాలు కోల్పోయింది. యువకుడికి గాయాలయ్యాయి.

నెల్లూరు సమీప గ్రామానికి చెందిన విద్యార్థిని.. కోట మండలం విద్యానగర్​లోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతోంది. అదే కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం నాయుడుపేట మండలం మేనకూరులోని ఓ కంపెనీలో ఆ యువకుడు పని చేస్తున్నాడు. విద్యార్థిని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details