నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం గాంధీనగర్లో ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. వరుసకు తండ్రి అయిన కత్తి రమణయ్య ఈ ఘాతుకానికి పాల్పడటం దారుణమని అన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని.. ఏపీ రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు
నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు