ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు

By

Published : Jan 18, 2020, 3:02 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

A seven year old tribal girl raped
ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు

ఏడేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం..మండిపడ్డ ప్రజాసంఘాలు

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం గాంధీనగర్​లో ఏడేళ్ల గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. వరుసకు తండ్రి అయిన కత్తి రమణయ్య ఈ ఘాతుకానికి పాల్పడటం దారుణమని అన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని.. ఏపీ రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details