ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 8, 2023, 7:22 PM IST

ETV Bharat / state

మాచర్లలో హైఅలర్ట్‌.. టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరైన బ్రహ్మారెడ్డి

TDP Leader Julakanti Brahma Reddy: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘర్షణల తరువాత మొదటిసారి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి పట్టణానికి వచ్చారు. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Etv Bharat
Etv Bharat

TDP Leader Julakanti Brahma Reddy : పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘర్షణల తరువాత మొదటిసారి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి పట్టణానికి వచ్చారు. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. మొత్తం 22మంది నేతలు, కార్యకర్తలతో కలిసి గుంటూరు నుంచి ప్రైవేటు బస్సులో వచ్చిన బ్రహ్మారెడ్డి స్టేషన్‌లో సంతకం చేసి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను సైతం పోలీస్‌స్టేషన్‌ వద్దకు అనుమతించలేదు. దీంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకపోవటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details