ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అవినాష్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మహిళలపై వైసీపీ మహిళల దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

By

Published : Jan 10, 2023, 11:25 AM IST

Updated : Jan 10, 2023, 12:58 PM IST

YCP WOMENS ATTACK THE TDP WOWEN: సోమవారం గడపగడపకు కార్యక్రమంలో దేవినేని అవినాష్ చేదు అనుభవం ఎదురైంది. 'మీరు గుడివాడలో తెలుగుదేశం తరఫున పోటీ చేసినప్పుడు ఆ జెండాను పెట్టాం' అని మరో మహిళ చెప్పడంతో అవినాష్ మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. మంగళవారం మా నాయకుడికే ఎదురుతిరుగుతావా అంటూ వైసీపీ మహిళా కార్యకర్తలు కారం, రాళ్లతో దాడికి దిగి ఇంట్లో ఉన్న సామాగ్రి నాశనం చేశారు. అయితే, ఈ ఘటనపై అవినాష్ స్పందించారు. పాదయాత్రగా వెళుతున్న తమ రెచ్చగొట్టారని వివరణ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat

YCP WOMENS ATTACK THE TDP WOWEN: వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం అలవాటై పోయింది. ప్రస్తుతం వైసీపీ మహిళ కార్యకర్తలు సైతం టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు.

సోమవారం దేవినేని అవినాష్ కు చేదు అనుభవం:పనిచేసినోళ్ల జెండాలనే మా ఇళ్లపై పెట్టుకుంటాం. అందుకే తెదేపా జెండా పెట్టుకున్నాం అంటూ విజయవాడలోని రాణిగారితోటకు చెందిన పలువురు మహిళలు వైకాపా నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను మోసం చేశారంటూ నిలదీశారు. తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఇన్‌ఛార్జ్‌ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో రాణిగారితోటలోని తారక రామా నగర్లో ఎస్కే రమీజా అనే మహిళ ఇంటివద్ద ఆగారు. ఒంటరి మహిళ పింఛను కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఇంటిపై తెదేపా జెండాను చూస్తూ.. "ఇది మనం పెట్టిందేనా' అని దేవినేని అవినాష్ అడిగారు. 'ఔను! ఎందుకు పెట్టామో తెలుసా మమ్మల్ని ఆయన మోసం చేశారు' అంటూ కార్పొరేటర్ రామిరెడ్డిని చూపిస్తూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు గుడివాడలో తెలుగుదేశం తరఫున పోటీ చేసినప్పుడు ఆ జెండాను పెట్టాం' అని మరో మహిళ చెప్పడంతో అవినాష్ మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది.

మంగళవారం 20 మంది వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి:విజయవాడ రాణిగారితోటలో వైకాపా నేత దేవినేని అవినాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం సానుభూతిపరులపై వైకాపా మహిళా కార్యకర్తలు దాడి చేశారు. ఎస్కే రమీజా అనే మహిళ ఇంటి వద్ద సామగ్రిని చిందరవందర చేశారు. రాళ్లు రువ్వారు. సమీపంలోని దుకాణంలో కారం పొట్లాలు కొని అడ్డొచ్చిన వారిపై చల్లేందుకు యత్నించారు.

వైకాపా కార్పొరేటర్‌ తమను మోసగించినందుకే తెలుగుదేశం జెండా పెట్టామంటూ ఆ మహిళ స్పష్టం చేశారు. గుడివాడలో తెదేపా తరఫున మీరు పోటీ చేసినప్పుడు ఆ జెండా పెట్టామని మరో మహిళ చెప్పారు. తాము మీ వెంట తిరిగినా... చిన్న చిన్న అవసరాలు పరిష్కరించేందుకూ కార్పొరేటర్‌ చొరవ చూపడం లేదని అవినాష్‌ ముందు అసంతృప్తి వెళ్లగక్కారు. ఇది మనసులో పెట్టుకున్న వైకాపా మహిళా కార్యకర్తలు 20 మంది మంగళవారం ఉదయం రమీజా ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యం చేశారని స్థానికులు తెలిపారు. అవినాష్‌ అనుచరులు దామోదర్‌, చిన్నారి, మాధవి దాడిచేశారని తెదేపా ఆరోపిస్తోంది.

పోలీసుల అదుపులో బాధితులు: దాడిలో గాయపడిన బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నాురు. కృష్ణలంక పీఎస్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను వెళ్లొద్దంటూ ఆటోనగర్‌లోనే ఎమ్మెల్యేను పోలీసులు అడ్డగికోవడంతో వాగ్వాదం జరిగింది.

అవినాష్ వివరణ: విజయవాడ రాణిగారితోటలో తమవారిపైనే దాడి చేశారని... వైకాపా నాయకుడు దేవినేని అవినాశ్‌ అన్నారు. పాదయాత్రగా వెళుతున్న తమ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలను రెచ్చగొట్టి, అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. వారి వెనుక తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఉన్నారని ఆరోపించారు.

అవినాష్ కు వ్యతిరేకంగా మాట్లాడిన మహిళలపై వైసీపీ మహిళల దాడి

ఇవీ చదవండి

Last Updated : Jan 10, 2023, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details