ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలు జిల్లాలో విషాదం... సాంబారులో పడి విద్యార్థి మృతి

By

Published : Nov 13, 2019, 6:44 PM IST

పాపం ఆ పసివాడు అన్నం తిందామని ఆశగా అక్కడికి వచ్చాడు. అందరితో పాటు వరుసలో నిలబడ్డాడు. కానీ విధికి ఆ బాలుడి చలాకితనం నచ్చలేదేమో... సాంబారు గిన్నె రూపంలో కబళించింది. సాంబారు వేడికి తాళలేక ఆ చిన్నారి మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది.

సాంబారు గిన్నెలో పడి యూకేజీ విద్యార్థి మృతి

సాంబారు గిన్నెలో పడి యూకేజీ విద్యార్థి మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలో సాంబార్​లో పడి యూకేజీ విద్యార్థి మృతిచెందాడు. నగరంలోని విజయానికేతన్ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్న పురుషోత్తంరెడ్డి... మధ్యాహ్న భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడ్డాడు. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడు.

బాలుడి తల్లి కొన్నేళ్ల కిందట మరణించగా... తండ్రి శ్యాంసుందర్... పురుషోత్తంరెడ్డిని పాఠశాల వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. కుమారుడి మరణంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details