నంద్యాలకు ఎస్పీవై రెడ్డి భౌతికకాయం
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్ధివదేహాన్ని బొమ్మలసత్రంలోని అయన స్వగృహానికి తీసుకొచ్చారు.
నంద్యాలకు ఎస్పీవై రెడ్డి భౌతికకాయం
కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్ధివదేహాన్ని నంద్యాలకు తీసుకొచ్చారు. నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని అయన స్వగృహంలో ఎస్పీవై రెడ్డి భౌతికకాయాన్ని ఉంచారు. ప్రజలు, ఆయన అభిమానులు, పలు పార్టీల కార్యకర్తలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. గురువారం ఉదయం ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.