ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ.60 లక్షల విలువైన గుట్కా పట్టివేత.. ముగ్గురి అరెస్టు

By

Published : Jul 24, 2020, 4:21 PM IST

కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో గుట్కా అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు రూ.60 లక్షల విలువైన సరకు స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.60 లక్షల విలువైన గుట్కా పట్టివేత.. ముగ్గురి అరెస్టు
రూ.60 లక్షల విలువైన గుట్కా పట్టివేత.. ముగ్గురి అరెస్టు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల సమీపంలో సుమారు రూ.60 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను ఎస్​ఈబీ పోలీసులు పట్టుకున్నారు. బళ్లారి నుంచి లారీలో కోవెలకుంట్లకు అక్రమంగా తరలిస్తుండగా సరకు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్​ చేసి.. ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న కోవెలకుంట్లకు చెందిన మనోహర్​ కోసం గాలిస్తున్నారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details