కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలోని సింగనగేరికి చెందిన నిరుపేద మహిళలు గత 40 ఏళ్లుగా చింతపండు వ్యాపారం చేస్తున్నారు. కాలనీలో ఈ వ్యాపారం చేసేవాళ్లు దాదాపుగా ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఏటా లాభాల బాటలో నడిచిన చింతపండు వ్యాపారం ఈ ఏడాది ఆశించినంత లాభం రాలేదు. కనీస పెట్టుబడి కూడా రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి పెరిగింది.. ఆదాయం తగ్గింది..
గ్రామానికి చెందిన మహిళలు రెండు వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరు 20 నుంచి 30 చింతచెట్లను కౌలుకు తీసుకున్నారు. దిగుబడి బాగా ఉన్నప్పటికీ విక్రయానికి ఆశించినంత ధర పలకడం లేదు. ప్రతియేటా క్వింటాల్ చింతపండు రూ. 16 వేల వరకు పలికేది. కానీ ఈ ఏడాది కనీసం ఆరు వేలు కూడా పలకడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..