ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 19, 2020, 7:27 PM IST

ETV Bharat / state

'వైద్యశాల, మెడికల్ కళాశాల అభివృద్దికి 720 కోట్లు మంజూరు'

కర్నూలు సర్వజన వైద్యశాల, మెడికల్ కళాశాల అభివృద్ధికి రూ. 720 కోట్లు మంజూరు అయ్యాయని ఆ కళాశాల ప్రిన్సిపాల్​ చంద్రశేఖర్​ తెలిపారు. కర్నూలు మెడికల్ కళాశాలను ఎంపీ సంజీవ్​కుమార్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా నియంత్రణలోనే ఉందన్నారు.

mp sanjeev kumar
mp sanjeev kumar

కర్నూలు జిల్లాలో కరోనా నియంత్రణలోనే ఉందని ఎంపీ సంజీవ్​కుమార్ తెలిపారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలను ఆయన సందర్శించారు. కర్నూలు వైద్య కళాశాలకు రెండు పీజీ యూరాలజీ సీట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. మరికొన్ని పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాల, మెడికల్ కళాశాల అభివృద్దికి 720 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని ప్రిన్సిపల్ చంద్రశేఖర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details