కర్నూలు లోక్సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా ఎన్నికైన సోమిశెట్టి వెంకటేశ్వర్లును కార్యకర్తలు తెదేపా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అన్ని లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయని... జమిలి ఎన్నికలకు సిద్దం కావాలని కార్యకర్తలను కోరారు.
'రాబోయే జమిలి ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుదాం'
రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియామకంతో.. తెదేపా మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. వచ్చే జమిలి ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్దం కావాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షునికి ఘన సన్మానం