కరోనా వైరస్ కట్టడిలో ముందుండే వైద్యుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జూనియర్ వైద్యులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. తమకు నాణ్యమైన మాస్కులు, పీపీఈ కిట్లను ఇవ్వడం లేదని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి ఆవరణలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నాసిరకమైన మాస్కులు, పీపీఈ కిట్లతో వైద్యం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.