ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నంద్యాలలో గుట్కా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

By

Published : Mar 20, 2020, 9:59 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో గుట్కా తరలిస్తున్న ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రవాణాకు సిద్ధంగా ఉంచిన గుట్కా, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

gutka seized in nandyala
గుట్కా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

గుట్కా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

కర్నూలు జిల్లా నంద్యాలలో ఇద్దరు గుట్కా విక్రయదారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల రాకను గమనించిన మరో వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. పట్టణంలో ఏకలవ్యనగర్​ సమీపంలో మధుసూదన్, జాఫర్, కోటేశ్వరరావు అనే వ్యక్తులు గుట్కా తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన గుట్కా, 1.75 లక్షల నగదు, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివశంకర్​ వెల్లడించారు. గుట్కాను రవాణా చేసేందుకు ఉపయోగించిన బైక్​ను సీజ్ చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details