కర్నూలు జిల్లా కోడుమూరులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సరుకులను పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలపై ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేశారు. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలోని పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు సంఘం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ సంఘం సభ్యులు నాగరాజు, వెంకటస్వామి చెప్పారు. మొత్తం 200 మందికి బియ్యం, 5 రకాల కూరగాయలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు వీర శేఖర్ ఆచారి, నాగేంద్ర ఆచారి, వేంగోడు శ్రీనివాసాచారి, తిమ్మయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు.