ఉల్లి లొల్లి.. ఎమ్మిగనూరులో తోపులాట
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లిగడ్డల కోసం ప్రజలు ఎగబడ్డారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్లో ఉల్లి నిల్వలు అయిపోవడంతో పంపిణీ రెండు రోజులపాటు నిలిపివేశారు. అధికారులు మరో లారీ ఉల్లిగడ్డలు తెప్పించారు. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా మార్కెట్కు తరలివచ్చారు. రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినా తోపులాట జరిగింది.
ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట