కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సాగులో ఉన్న పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న, కంది, పత్తి, మిరప, వరి పంటలను 36 వేల హెక్టార్లలో సాగు చేశారు. నీరు పంట పొలాల్లోకి చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో ఉన్న వర్షపు నీటి నిల్వల వల్ల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.