ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 23, 2020, 4:40 PM IST

ETV Bharat / state

అమరావతి రాజధానికి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే దీక్ష

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమరావతి రాజధానికి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దీక్ష చేపట్టారు. 5 కోట్ల ఆంధ్రుల కలను తుంచేయడం ప్రభుత్వానికి తగదని సూచించారు.

ex mla jaya nageswara reddy protest for amaravathi in emmiganurur kurnool district
అమరావతి రాజధానికి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే దీక్ష

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమరావతి రాజధానికి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ.. అమరావతి అంశం ఐదు కోట్ల ప్రజలదని.. ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించడం తగదన్నారు. కొవిడ్ కేంద్రాల్లో రోగులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందుకు తార్కాణంగా బాధితులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details