కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేమగోడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరణించిన వ్యక్తి హనుమంతు(60)గా స్థానికులు గుర్తించారు. పండుగా సంత కోసం కోడుమూరుకు వెళ్తుండగా డబుల్ లైన్ రహదారిలో వెళ్తున్న ఆటో.... మరో ఆటోను ఓవర్ టేక్ చేయబోతూ ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆటో ప్రమాదంలో వ్యక్తి మృతి
వేమగోడు వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో హనుమంతు(60) అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆటోను ఢీకొట్టిన మరో ఆటో