ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2021, 9:10 AM IST

ETV Bharat / state

రేపటి నుంచి నంద్యాలలో బేస్ ​బాల్ ఛాంపియన్​ షిప్

ఈ నెల 29 నుంచి కర్నూలు జిల్లా నంద్యాలలో 34వ సీనియర్ జాతీయస్థాయి బేస్​ బాల్ ఛాంపియన్ ​షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు.

National Baseball Championship at Nandyal
నంద్యాలలో బేస్ ​బాల్ ఛాంపియన్​ షిప్

కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ నెల 29 నుంచి 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్​ బాల్ ఛాంపియన్​ షిప్ (పురుషులు, మహిళలు) పోటీలు జరగనున్నాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోటీల ఏర్పాట్లను నిర్వహకులు పరిశీలించారు.

ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో 22 రాష్ట్రాలకు చెందిన 1000మంది క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల అనంతరం ఇక్కడే జాతీయ జట్టు ఎంపిక జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details