తనపై అనర్హత వేటును కోరుతూ... లోక్సభ స్పీకర్కు వైకాపా ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై నరసాపురం ఎంపీ రఘురామ స్పందించారు. వారు కోరినట్టుగా అనర్హత అన్నది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఏనాడూ పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. అలా అని ఏ పార్టీతోనూ జతకట్టలేదని చెప్పుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో సర్కార్ లోపాలను మాత్రమే ప్రస్తావించానన్న రఘురామ.. కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని వెల్లడించారు.
మరోసారి ప్రివిలైజ్ మోషన్ వేస్తా: రఘురామ