ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''తెదేపాలో తిరుగుతున్నాననే.. నన్ను కొట్టారు''

కృష్ణా జిల్లా జుజ్జూరులో తెదేపా కార్యకర్తపై ప్రత్యర్థులు దాడిచేశారు. గాయాలపాలైన ాన అతడిని నందిగామ ఆస్పత్రికి తరలించారు.

By

Published : Jul 13, 2019, 4:15 PM IST

దాడి

తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో తెదేపా కార్యకర్త పానకాల ప్రసాద్​పై వైకాపా వర్గీయులు దాడిచేశారు. స్వల్పగాయాలైన అతడిని చికిత్స కోసం నందిగామ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనపై కర్రతో విపరీతంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తెదేపాలో కార్యకర్తగా తిరుగుతానన్న కోపంతోనే.. తనను ఒక్కడిని చేసి గాయపరిచారని ఆరోపించాడు. నడి రోడ్డుపై ట్రాక్టర్ ఆపి.. తన బండిలోని రాడ్డే తీసుకుని దాడి చేశారన్నాడు. స్థానికులు వచ్చి దాడిని ఆపారని.. తన స్నేహితులు ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details