ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బొత్సని సీఎం జగన్​ వెనకేసుకొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు'

By

Published : Jan 24, 2020, 9:55 AM IST

Updated : Jan 24, 2020, 2:58 PM IST

మతం పేరుతో దూషించడం మంత్రి బొత్స రౌడీయిజానికి నిదర్శనమని విజయవాడలో తెదేపా నేత మహమ్మద్‌ నసీర్‌ మండిపడ్డారు. ఛైర్మన్‌గా తనకున్న హక్కు ప్రకారమే షరీఫ్‌ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపారన్నారు. అది చూసి ఓర్వలేని మంత్రులు బొత్స, అనిల్‌, షరీఫ్‌పై దాడికి యత్నించడం దారుణమని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన బొత్సపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ ... బొత్సని వెనకేసుకొస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

tdp leaders press meet at vijayawada
విజయవాడలో తెదేపా నేతల మీడియా సమావేశం

మంత్రుల తీరు సరికాదన్న తెదేపా నేత మహమ్మద్​ నసీర్​

ఇదీ చూడండి:

Last Updated : Jan 24, 2020, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details