ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2021, 9:32 PM IST

ETV Bharat / state

వీఆర్వోల‌ సంఘం నూతన అధ్యక్షుడిగా రవీంద్ర రాజు

విజయవాడలో రాష్ట్ర వీఆర్వో సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. 12 జిల్లాల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఆర్వోల‌ సంఘం నూతన అధ్యక్షుడిగా రవీంద్ర రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

State VRVO Association Representatives Meeting
రాష్ట్ర వీఆర్వో సంఘం ప్రతినిధుల సమావేశం

బొప్పరాజు అమరావతి జేఏసీ పేరుతో అందరనీ మోసం చేస్తున్నారని.. అందుకే కొత్త అసోసియేషన్ కార్యవర్గం ఎన్నుకున్నామని వీఆర్వోల‌ సంఘం నూతన అధ్యక్షుడు రవీంద్ర రాజు పేర్కొన్నారు. రాష్ట్ర వీఆర్వో సంఘం ప్రతినిధుల సమావేశం విజయవాడలో నిర్వహిచారు. 12 జిల్లాల నుంచి హాజరైన అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. ముఖ్య అతిధులుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డిలు పాల్గొన్నారు. సంఘంలో ఇద్దరు వ్యక్తులతో.. బొప్పరాజు చీకటి ఒప్పందం చేసుకున్నారని రవీంద్రరాజు ఆరోపించారు. వారి కుట్రలు తెలిసినందునే.. కొత్త కార్యవర్గానికి 14 వేల మంది వీఆర్వోలు అండగా నిలిచారన్నారు.

ABOUT THE AUTHOR

...view details