ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 4, 2021, 3:34 PM IST

Updated : Jan 4, 2021, 7:55 PM IST

ETV Bharat / state

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి..

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో రైతు గర్జన పేరుతో ర్యాలీ నిర్వహించారు. రైతులకు నష్టాన్ని కల్గించే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నేడు జరగనున్న చర్చల్లో అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

farmers protest
రైతు గర్జన

కేంద్రం ప్రవేశపేట్టిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని... రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో రైతు గర్జన పేరుతో... ట్రాక్టర్లు, ఇతర మోటారు వాహనాలతో అన్నదాతలు భారీ ర్యాలీ చేశారు. నేడు జరగనున్న ఏడో విడత చర్చల్లో కర్షకులకు అనుకూలంగా... కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ఇప్పటివరకు జరిగిన చర్చల్లో రైతు సంఘాల డిమాండ్‌లపై ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా దాటవేత ధోరని ప్రదర్శిస్తోందని విమర్శించింది. ఎంఎస్‌ స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. వీటితో పాటు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని పునరుద్ఘాటించింది. వీటిపై ప్రభుత్వం సానుకూల సంకేతాలిచ్చే వరకు పోరాటం ఆపమని పేర్కొంది.

కృష్ణా జిల్లాలో రైతు గర్జన పేరుతో ర్యాలీ

ఇదీ చదవండి:చర్చల కోసం విజ్ఞాన్ భవన్ చేరుకున్న రైతులు

Last Updated : Jan 4, 2021, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details