కృష్ణా జిల్లా తిరువూరు మండలం చింతలపాడు బస్టాండ్లో.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కుమారులు వదిలి వెళ్లారు. మైలవరం మండలం పుల్లూరు శివారు దాసుళ్లపాలెంనకు చెందిన వృద్ధురాలిని ఆటోలో తీసుకువచ్చి బస్టాండ్లో అనాధగా వదిలేశారు. ఆకలి బాధ ఒకపక్క వయసు సహకరించక నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను గమనించిన చింతలపాడు గ్రామ సచివాలయం సిబ్బంది మల్లెల సహకార సంఘం అధ్యక్షుడు కలకొండ రవికుమార్కు సమాచారం అందించారు.
స్పందించిన ఆయన తిరువూరు పట్టణంలో ఐడియాస్ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న సౌరిని సంప్రదిచగా విస్సన్నపేట ఆశ్రమంలో చేర్పించాలని సూచించారు. కలకొండ రవికుమార్ ఆమెను తానే స్వయంగా తీసుకెళ్లి విస్సన్నపేట వృద్ధాశ్రమంలో చేర్చి మానవత్వం చాటుకున్నారు. ఒక కుమారుడు విశాఖపట్నంలో, మరో కుమారుడు గంపలగూడెంలో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది.