ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత ప్రారంభం - ysr kanti velugu programme at kurnool and krishna district

కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కర్నూలులో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.

కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రం ప్రారంభం

By

Published : Nov 1, 2019, 8:53 PM IST

కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రం ప్రారంభం

వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని కర్నూలులో జిల్లాలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మంచి పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్ధతు ఉంటుందన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకొని... క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లాలో 6లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా... 39 వేల మందికి కంటి సమస్యలున్నాయని వివరించారు.

కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్‌ ప్రారంభించారు. విజయవాడ బిషప్‌ అజరయ్య పాఠశాలలోని స్క్రీనింగ్‌ సెంటర్​లో పరీక్షల నిర్వహణను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 4 వేల 400 పాఠశాలల్లో 5 లక్షల 65 వేల మందికి తొలివిడతలో కంటి పరీక్షలు జరిపారు. 42 వేల 600 మంది విద్యార్థులకు రెండో విడతలో పరీక్షలు చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లాలో 372 స్క్రీనింగ్‌ సెంటర్లు ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.


ఇదీ చూడండి:"ఆంధ్రప్రదేశ్​కు మూడు రాజధానులు అవసరం"

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details