ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా కాలనీలో డంపింగ్​ యార్డు తొలగించండి' - పోరంకిలోని వెంకటాపురం కాలనీ వాసుల ధర్నా

తమ కాలనీకి ఎదురుగా చెత్తను డంపింగ్ చేయవద్దని పలుమార్లు అధికారులతో మెుర పెట్టుకున్నారు అక్కడి వాసులు. స్పందన కార్యక్రమంలోనూ తమ విన్నపాన్ని అధికారుల ముందుంచారు. ఎవరూ వారిని పట్టించుకోలేదు సరికదా... మరింత చెత్తను వేస్తూనే వచ్చారు. విసిగిన కాలనీ వాసులు సీఎం స్పందించాలంటూ ధర్నాకి దిగారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది.

చెత్తను తమ కాలనీ ఎదుట డప్పింగ్ చెయవద్దంటూ ధర్నా

By

Published : Nov 2, 2019, 2:59 PM IST

Updated : Nov 2, 2019, 7:58 PM IST

తమ కాలనీ ఎదుట చెత్తను డంపింగ్​ చేయవద్దంటూ స్థానికుల ధర్నా
కృష్ణా జిల్లా విజయవాడలోని పోరంకిలో... వెంకటాపురం కాలనీ వాసులు ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగారు. తమ ప్లాట్ల వద్ద చెత్త వేయవద్దని రెండేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా... ఫలితం లేదని వాపోయారు. చెత్త, ఇతర వ్యర్థాలను తమ కాలనీ ముందు రహదారి మీద పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా... అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను అక్కడి నుంచి తరలించాలని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఇంతియాజ్ దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ ప్రాంతంలో చెత్త వేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై స్పందించి... చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 2, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details