ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని విద్యార్థిని మృతి

గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో ఒక విద్యార్థిని మృతి చెందింది. మరొకరు గాయ్యాలపాలయ్యారు. ఈ ప్రమాదం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వద్ద జరిగింది.

By

Published : Jan 27, 2021, 8:25 PM IST

Road Accident
రోడ్డు ప్రమాదం

పాఠశాల నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను... గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామం వద్ద జరిగింది.

ఏటిమోగలోని ఉన్నత పాఠశాలలో రేష్మ, మౌనిక అనే విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో... రేష్మ అక్కడిక్కడే మరణించింది. మౌనిక కు గాయాలవ్వడంతో అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని... వాహనం కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఇదీ చదవండి:నందిగామలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details