ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రమాదవశాత్తు నదిలో పడి వృద్ధుడు మృతి

By

Published : Jun 28, 2020, 3:16 PM IST

పశువులు మేపేందుకు కృష్ణానది పాయలోకి వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

old man death with drop krishna river in thotlavalloor krishna district
ప్రమాదవశాత్తు నదిలో పడి వృద్ధుడు మృతి

కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలంలోని ఐలూరుకు చెందిన రామయ్య అనే వృద్ధుడు కృష్ణా నది పడి మృతిచెందాడు. పశువులను మేపడానికి కృష్ణా నదీపాయలోకి వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నదిలో జారి గల్లంతయ్యాడు. సాయంత్రానికి జీవాలు ఇంటికి వచ్చినప్పటికీ.. రామయ్య రాకపోవడంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నదిలో గాలింపు చర్యలు చేపట్టగా రామయ్య మృతదేహాం లభ్యమైంది.

ABOUT THE AUTHOR

...view details