ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద బాధితుల పునరావాసంపై నీలినీడలు

By

Published : Oct 21, 2020, 11:13 AM IST

భారీ వర్షాలు, వరదల వల్ల విజయవాడలోని కొన్ని ప్రదేశాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల ప్రజలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పునరావాసం కల్పించారు. కానీ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమం ఉండటంతో అక్కడా చోటు లేకుండా పోతుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

vijayawada rehabilitation center
వరద బాధితుల పునరావాస కేంద్రం

కృష్ణానది వరద ధాటికి విజయవాడలో కొన్ని కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వరద బాధితులకు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పునరావాసం కల్పించారు. ఏదో కార్యక్రమం ఉందంటూ ఉన్నట్లుండి వారిని ఖాళీ చేయమన్నారు. సామాన్లు తీసుకుని వెళ్లడం కష్టమని బాధితులు వాపోయారు. పోలీసులు వారిని మరోచోటకు తరలించారు. సామగ్రి పరిస్థితి ఏంటని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఒకచోట.. వారి వస్తువులు మరో చోట ఉన్నాయి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details