ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడి రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ బోనస్ రూ. 2.50 కోట్లు - కృష్ణా జిల్లాలో పాడి రైతులకు బోనస్ ఇచ్చిన కృష్ణా మిల్క్ యూనియన్

కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పాడి రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్... బోనస్ ఇచ్చి అండగా నిలబడింది. లక్ష్మీపురం పాల శీతల కేంద్రం పరిధిలోని పాడి రైతులకు రెండున్నర కోట్ల రూపాయలను బోనస్ రూపంలో అందించింది.

krishna milk union release bonus to dairy farmers at lakshimi puram krishna district
పాడి రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ బోనస్ రూ. 2.50 కోట్లు

By

Published : Apr 23, 2020, 7:45 PM IST

Updated : Apr 23, 2020, 9:00 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పాడిరైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ అండగా నిలిచింది. తిరువూరు మండలం లక్ష్మీపురం పాల శీతల కేంద్రం పరిధిలోని పాల ఉత్పత్తి దారుల సంఘాల్లో సభ్యులుగా ఉన్న పాడిరైతులకు రూ. 2.50 కోట్లను బోనస్ రూపంలో మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని యూనియన్ జిల్లా డైరెక్టర్ బోయపాటి సుశీల.. లక్ష్మీపురం పాల శీతల కేంద్రం మేనేజర్ ఉదయ కిరణ్​కు అందజేశారు. పాడిరైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బోనస్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

Last Updated : Apr 23, 2020, 9:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details