సెర్ప్ సీఈవోగా కృష్ణా జిల్లా జేసీ మాధవిలతను నియమించారు. ప్రస్తుత సెర్ప్ సీఈవో రాజాబాబును జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల జేసీ శివశంకర్కు రెవెన్యూ, రైతు భరోసా కేంద్రాల జేసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మారిటైమ్ బోర్డు తాత్కాలిక సీఈవో రామకృష్ణారెడ్డిని రిలీవ్ చేసిన సర్కారు.. ప్రస్తుతం కరైకల్ పోర్టు సీఈవోగా పని చేస్తున్న మురళీధరన్ను మారిటైమ్ బోర్డు సీఈవోగా నియమించింది.
సెర్ప్ సీఈవోగా కృష్ణా జిల్లా జేసీ మాధవి లత
కృష్ణా జిల్లా జేసీ మాధవి లత సెర్ప్ సీఈవోగా నియమితులయ్యారు. కృష్ణా జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల జేసీ శివశంకర్కు రెవెన్యూ, రైతు భరోసా కేంద్రాల జేసీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా జిల్లా జేసీ మాధవి లత సెర్ప్ సీఈవో పోస్టుకు బదిలీ