ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 5:09 PM IST

ETV Bharat / state

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా‌ అరెస్ట్‌.. సరుకు, 2 బైకులు స్వాధీనం

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ బంకియా లక్ష్మణ్, అతని నలుగురు అనుచరులను కృష్ణా జిల్లా రెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తరలిస్తున్న 14 కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ బంకియా లక్ష్మణ్, అతని నలుగురు అనుచరులను కృష్ణా జిల్లా రెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు ఒడిశాకు చెందిన లక్ష్మణ్‌తో పాటు నలుగురిని అదుపుతోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి 14 కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌ గత ఐదేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు నమోదయినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details