ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 6:16 PM IST

ETV Bharat / state

నివర్​తో ఒక్కసారిగా పెరిగిన వరి కోత ధరలు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరేంతవరకు రైతన్నకు అడుగడున అవాంతరాలే. గతంలో కురిసిన వర్షాలకు వరి పంట నేలకొరిగింది. ఉన్న పంటైనా కోత కోసి ఇంటికి తీసుకెళ్తామంటే.. వరికోత ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నివర్​ తుపాను హెచ్చరికలతో వరికోత వేళల్లో డిమాండ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలపై ప్రత్యేక కథనం..

Increased grain cutting
నివర్​తో ఒక్కసారిగా పెరిగిన కోత ధరలు

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా అయిన గుంటూరు నుంచి కూడా కోతలు కోసేందుకు కూలీలు వస్తున్నారు. దీంతో వరి కోత రేటును ఒక్కసారిగా మూడు రెట్లు పెంచేశారు. ఒక్కో ఎకరానికి 10వేలు నుంచి 12 వేలు వరకు కూలి ఖర్చులు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కురిసి వర్షాలకు 80శాతం పంట నేలకొరింది. మిగిలిన పంటను కోత కోద్దామంటే నివర్​ తుఫాన్​ హెచ్చరికలతో కూలీలు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

రెండో పంటగా మినుము విత్తనాలు చల్లిన పొలంలో వరి కోత కోయకపోతే.. మినుములు మొలెకెత్తుతాయని, అనంతరం కోత సమయంలో ఆ మొక్కలు తెగిపోయి.. ఆయా పంటను నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ఇలాంటి పరిస్థితులకు నివర్​​ తుఫాన్​ తోడు కావటం.. ఒక్కసారిగా కూలీలు మూడు రెట్లు కూలి రెట్లు పెంచటంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో ఉన్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఒక్కసారిగా పెరిగిన వరికోతల ధరలతో కొంతమంది రైతులు పంటను కోయకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. ప్రభుత్వం రెండో పంటకు రాయితీపై మినుము విత్తనాలు కూడా ఇవ్వడం లేదని.. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదంటున్నారు. ఇక నివర్​ తుఫాన్​పై వ్యవసాయ అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని, తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న వరి పంటకు ఇన్సురెన్స్ వచ్చేవిధంగా ప్రభుత్వం తమకు సహాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details