ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2021, 8:08 PM IST

ETV Bharat / state

మద్యం మత్తులో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

మద్యం మత్తులో భార్యను కత్తితో పొడిచి భర్త హత్య చేసిన దారుణఘటన విజయవాడ నగర శివారు పాయకాపురం ఎల్​బీఎస్ నగర్​లో కలకలం సృష్టించింది. దంపతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిన కారణంగానే నిందితుడు తీవ్ర ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు వెల్లడించారు.

మద్యం మత్తులో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
మద్యం మత్తులో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

విజయవాడ నగర శివారు పాయకాపురం ఎల్​బీఎస్ నగర్​లో భార్యను కత్తితో పొడిచి భర్త హత్య చేశాడు. మృతురాలు నీరజ బీసెంట్ రోడ్డులో బొమ్మల దుకాణం నిర్వహిస్తున్నారు. పని పాట లేని భర్త మద్యానికి బానిసగా మారి భార్యతో నిత్యం ఘర్షణ పడేవాడని స్థానికులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే దంపతుల మధ్య మాటా మాటా పెరిగి నిందితుడు తీవ్ర ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న ఏసీపీ షేక్ షాను, నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details