ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంటా కుమర్తె ఇంటి కూల్చివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే పొడిగింపు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి భవనాన్ని కూల్చివేతను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల గడవును హైకోర్టు మరో 3వారాలు పొడిగించింది.

By

Published : Aug 28, 2019, 5:43 AM IST

హైకోర్టు

గంటా కుమర్తె ఇంటి కూల్చివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే పొడిగింపు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత భవనం కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల్ని నిలుపివేస్తూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరో మూడు వారాలు పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లా భీమిలో జీ+2 భవనం కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కంచర్ల రవీంద్రనాథ్, గంటా సాయి పూజిత ఇటీవల హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతకు స్టే ఉత్తర్వులు పొందారు.

ABOUT THE AUTHOR

...view details