కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో ఓ రైతు పాముకాటుకు గురై మృతి చెందాడు. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన మోటుపల్లి బుజ్జి పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతను చనిపోయాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా గత నెల రోజుల్లో వరి కోతల వల్ల ఈ ప్రాంతంలో పాము కాట్లు పెరిగాయి.
దివిసీమలో పాముకాటుకు రైతు మృతి - crime news at divisima
పొలం పనులు చేస్తుండగా పాము కాటుకు గురై ఓ రైతు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలులో జరిగింది. అయితే గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో పాముల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోయారు.
![దివిసీమలో పాముకాటుకు రైతు మృతి farmer died in divisima due to snake bite](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5450604-656-5450604-1576933369124.jpg)
దివిసీమలో పాముకాటుకు మృతిెచెందిన రైతు