ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవినీతి, అక్రమాలను త్వరలోనే తెలుగుదేశం బట్టబయలు చేస్తుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తెలిపారు. ఈ మేరకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, డిజిటల్ వాల్యుయేషన్పై అభ్యర్థుల్లో అనుమానాలున్నాయన్నారు.
ఇప్పటికే కోర్టుకు..
పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. 7 వేల మంది పరీక్షలు రాస్తే ఇంటర్వ్యూలకు 340 మందిని మాత్రమే ఎంపిక చేయడమేంటని నిలదీశారు. పరీక్ష నిర్వహణకు ముందు డిజిటల్ వాల్యుయేషన్ ఉంటుందని ప్రభుత్వం, ఏపీపీఎస్సీ ఎక్కడా చెప్పలేదన్నారు.