ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాఠశాలలను ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు

ప్రభుత్వం విడతల వారీగా పాఠశాలలను ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు చేసింది. వచ్చేనెల 2 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు రోజువిడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించడంతో జిల్లావిద్యాశాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టింది. జిల్లా విద్య, వైద్యఆరోగ్యశాఖలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

By

Published : Oct 31, 2020, 5:17 PM IST

Published : Oct 31, 2020, 5:17 PM IST

covid test for all teachers and students in krishna dist
covid test for all teachers and students in krishna dist

ప్రభుత్వం విడతల వారీగా పాఠశాలలను ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు చేసింది. మూడు రోజులుగా కృష్ణాజిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, విజయవాడ అర్బన్‌ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఇతర ఆసుపత్రుల్లో మొత్తం 784మంది విద్యార్థులు, 26 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. గూడూరు మండలంలోని మల్లవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 మందికి, పెడన మండలంలోని చేవెండ్రపాలెంలో 180మందికి పరీక్షలు చేశారు. బందరు, పెడన, గూడూరు, అవనిగడ్డ, చల్లపల్లి తదితర మండలాల్లో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు కూడా పరీక్షలు చేశారు.

9,10 తరగతులకు తొలి ప్రాధాన్యం

వచ్చే నెల 2వ తేదీ నుంచి 9,10 తరగతుల పాఠశాలలు ప్రారంభం కానుండటంతో ఆలోపే ఆయా ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు పూర్తిస్థాయిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. 6,7,8 తరగతులు ప్రారంభానికి నవంబరు 23వరకు గడువు ఉండటంతో వారందరికీ 9,10 తరగతుల వారు పూర్తయిన తరువాత పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు చికిత్స తీసుకునేలా ఏర్పాట్లు చేసి, నెగిటివ్‌ వచ్చిన వారందరినీ పాఠశాలలకు అనుమతి ఇస్తారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో కూడా విద్యార్థులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు విధిగా ధరించాలి. పాఠశాల ఆవరణలోని తరగతి గదులు, ప్రయోగశాలలు అందరూ వినియోగించే ప్రదేశాలతోపాటు తరచుగా వాడే వస్తువులను శానిటైజేషన్‌ చేయించాలి. బల్లలు కుర్చీల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా చూడాలి. పాఠశాల నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆదేశాలు జారీ చేశాం

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని కోరుతున్నాం. పరీక్షల నిర్వహణ ఎమ్ఈఓలు పర్యవేక్షిస్తున్నారు. నిర్దేశించిన సమయంలోపు పరీక్షలు చేయించేలా కృషి చేస్తున్నాం.

- రాజ్యలక్ష్మి, జిల్లావిద్యాశాఖాధికారిణి

ఇదీ చదవండి:

'ఏ అంటే అమరావతి.. పి అంటే పోలవరం.. ఏపీని కాపాడండి'

ABOUT THE AUTHOR

...view details