ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ బస్టాండ్​ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

By

Published : May 22, 2020, 7:20 PM IST

విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్​ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. రద్దీని నియంత్రించేందుకు చక్కని ఏర్పాట్లు చేశారని సిబ్బందిని ప్రశంసిచారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులను వారి ప్రాంతాలకు పంపేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు.

krishna District Collector Imtiaz
విజయవాడ బస్టాండ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

విజయవాడల పండిట్ నెహ్రు బస్టాండ్​లో ప్రయాణికుల కోసం చేసిన ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. లాక్​డౌన్ సడలింపులతో నిన్నటి నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్​లు నడుస్తున్నాయని ఇంతియాజ్ అన్నారు. నిన్న వివిధ ప్రాంతాలకు 115 ఆర్టీసీ బస్సులు నడిచాయని... బస్సులో ప్రయాణించే ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ ఉంచుకోవాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులను వారి ప్రాంతాలకు పంపేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details