ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2020, 2:12 PM IST

ETV Bharat / state

మాస్కు లేకపోతే జరిమానా తప్పదు.. కృష్ణా జిల్లాలో అమలు...

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఎస్ఎమ్ఎస్ తప్పనిసరి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అసలు ఈ ఎస్ఎమ్ఎస్ ఏంటి... దీనికి కరోనా వైరస్​కు సంబంధం ఏంటో తెలుసుకోండి.

krishna collector on sms
కృష్ణా జిల్లాలో మాస్కు తప్పనిసరి

కరోనా నియంత్రణ చర్యలు కృష్ణా జిల్లాలో మరింత కఠినతరం చేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. వీటిల్లో భాగంగా పరిశుభ్రత(శానిటేషన్), మాస్క్ ధరించటం, భౌతిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించటం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

మాస్కు లేకండా రహదారిపైకి మెుదటిసారి వస్తే 100 రూపాయల జరిమానా ఉంటుందని... రెండోసారీ వస్తే మందలింపుతో పాటు నగదు జరిమానా, మూడోసారీ వస్తే వారిని క్వారంటైన్​కు తరలిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. మాస్కు ధరించి ఉండటం వలనే కరోనా పాజిటవ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారికి సోకకుండా ఉండే అవకాశం ఉందన్నారు.

'మాస్కులు ధరించటం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. మాస్కు ధరించకుండా బహరంగ ప్రదేశంలోకి వస్తే, జరిమానా విధించాలని రెవెన్యూ, మున్సిపల్, పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం. కరోనా వ్యాప్తిని నివారించటానికి మన దగ్గర ఉన్న సూత్రం ఎస్ఎమ్ఎస్. అంటే శానిటేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. వీటిని పాటిస్తూ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.' - ఇంతియాజ్ కృష్ణా జిల్లా కలెక్టర్

ఇదీ చదవండి:తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం సీసాలు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details